రైతులకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా అకౌంట్లోకి రూ.3 వేలు!
రైతులకు తీపికబురు. ప్రతి నెలా రూ.3 వేలు పొందొచ్చు. అయితే దీని కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరాలి. అలాగే ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాతి నుంచి ప్రతి నెలా డబ్బులు వస్తాయి.
పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్లో చేరడం వల్ల ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన తర్వాతనే ఈ డబ్బులు వస్తాయి. ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.3 వేలు పొందొచ్చు. దీని కోసం మీరు ముందుగానే ప్రతి నెలా కొంత డబ్బు కడుతూ వెళ్లాలి.
నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్కీమ్ నుంచి వైదొలిగితే చెల్లించిన డబ్బులు వస్తాయి. ఒకవేళ స్కీమ్లో చేరిన వారు మరణిస్తే.. భాగస్వామికి ప్రతి నెలా రూ.1500 లభిస్తాయి. 18 నుంచి 40 ఏళ్లలోపు వారు మాత్రమే ఈ స్కీమ్లో చేరందుకు అర్హులు.
మీరు స్కీమ్లో చేరిన దగ్గరి నుంచి మీకు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. 18 ఏళ్లలోనే స్కీమ్లో చేరితే నెలకు రూ.55 కట్టాలి. అదే 30 ఏళ్లలో చేరితే రూ.110 చెల్లించాలి. 40 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.200 కట్టాలి.
మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. మీరు పీఎం కిసాన్ మాన్ ధన్ స్కీమ్ డబ్బులను నేరుగా పీఎం కిసాన్ స్కీమ్ డబ్బుల నుంచి చెల్లించొచ్చు. చేతి నుంచి ఒక్క రూపాయి పెట్టుకోవాల్సిన పని లేదు.
మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. మీరు పీఎం కిసాన్ మాన్ ధన్ స్కీమ్ డబ్బులను నేరుగా పీఎం కిసాన్ స్కీమ్ డబ్బుల నుంచి చెల్లించొచ్చు. చేతి నుంచి ఒక్క రూపాయి పెట్టుకోవాల్సిన పని లేదు.
Please Comment ......Thank You