Today Update : రూ.2 డిపాజిట్ చేయండి.. రూ.36 వేలు పొందండి

Admin
By -
0

 రూ.2 డిపాజిట్ చేయండి.. రూ.36 వేలు పొందండి


ఉద్యోగులు మాదిరిగానే రోజువారీ కూలీలు కూడా వయసు పైబడిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మంధన్ యోజన తీసుకొచ్చింది.

 

ప్రధానాంశాలు:

  • అసంఘటిత రంగ కార్మికుల కోసం పీఎం శ్రమ్ యోగి మంధన్ యోజన
  • వీధి వర్తకులకు, రిక్షా డ్రైవర్లకు, ఇతరులకు ఎంతో ఉపయోగకరం
  • 60 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా పెన్షన్ భరోసా
  • ఈ స్కీమ్ చేరేందుకు కనీస వయసు 18 ఏళ్లు

ఉద్యోగులు మాదిరిగానే రోజువారీ కూలీలు కూడా వయసు పైబడిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మంధన్ యోజన తీసుకొచ్చింది. అసంఘటిత రంగంలో పనిచేసే వీధి వర్తకులు, రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కూలీలు, ఇతరులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పదవీ విరమణ పొందిన తర్వాత వీరికి ఈ పథకం సాయం చేస్తుందని చెప్పింది. ఈ స్కీమ్ కింద, ప్రభుత్వం కార్మికులకు పెన్షన్ చెల్లింపు భరోసానిస్తుంది. ఈ స్కీమ్‌లో కేవలం రోజుకు రూ.2 చెల్లించడం ద్వారా ఏడాదికి రూ.36 వేల పెన్షన్‌ను కార్మికులు పొందేందుకు వీలవుతుంది.

నెలకు రూ.55 డిపాజిట్ చేయాలి..

ఈ స్కీమ్‌ను ప్రారంభించాలంటే, మీరు నెలకు రూ.55 డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు, మీకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి రోజుకు రూ.2 ఈ పథకంలో సేవ్ చేయడం ద్వారా, నెలకు రూ.36 వేల పెన్షన్‌ను పొందే వీలుంటుంది. 40 ఏళ్ల వయసులో కూడా ఈ పథకాన్ని ప్రారంభించుకోవచ్చు. అయితే వీరు నెలకు రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు వచ్చిన తర్వాత, మీరు పెన్షన్‌కు అర్హులవుతారు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున, ఏడాదికి రూ.36 వేల పెన్షన్‌ను వీరు పొందవచ్చు.

ఈ స్కీమ్‌కి కావాల్సిన డాక్యుమెంట్లు
మీకు తప్పనిసరిగా సేవింగ్స్ అకౌంట్, ఆధార్ కార్డు ఉండాలి. ఈ స్కీమ్‌ని ప్రారంభించాలంటే మీ వయసు 18 ఏళ్ల కంటే తక్కువగా, 40 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండరాదు. ఆధార్ కార్డు, సేవింగ్స్ లేదా జన్ ధన్ బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, మొబైల్ నెంబర్ అనేవి రిజిస్ట్రేషన్‌లో తప్పనిసరిగా అవసరమయ్యే డాక్యుమెంట్లు. అంతేకాక, కార్మికునికి వారి బ్యాంకు బ్రాంచ్‌లో అకౌంట్ ఉన్నట్టు తెలుపుతూ ఉండే అంగీకార పత్రం కూడా బ్యాంకు నుంచి కావాలి. అయితే ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నెలవారీ వేతనం రూ.10 వేల కంటే తక్కువగా ఉండాలి.

  • ఈ స్కీమ్‌లో రిజిస్టర్ కావాలంటే కామన్ సర్వీసు సెంటర్ వద్దకు వెళ్లాలి.
  • సీఎస్‌సీ సెంటర్ వద్దనున్న వారి వెబ్‌సైట్‌ ద్వారా కార్మికులు అకౌంట్‌ను తెరుచుకోవచ్చు
  • ఈ పథకం కోసం, కేంద్ర ప్రభుత్వం వెబ్ పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేసింది.
  • ఆన్‌లైన్ ద్వారా సేకరించిన సమాచారం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు.

టోల్‌ఫ్రీ నెంబర్ నుంచి మరింత సమాచారం పొందవచ్చు..
ఈ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్‌మెంట్‌ను, ఎల్ఐసీని, ఈపీఎఫ్ఓ ఆఫీసులను శ్రామిక్ ఫెసిలిటేషన్ సెంటర్లుగా రూపొందించింది. ఈ స్కీమ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకునే వారికి 18002676888 టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ నెంబర్ ద్వారా కూడా ఈ స్కీమ్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)