గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది సర్దుబాటు

Admin
By -
0

 గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది సర్దుబాటు

ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజ నీర్-ఇన్-చీఫ్కి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మిగతా శాఖ ల్లోనూ ఇదే విధంగా సర్దుబాటు చేసి.. పనిలేకుండా ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 1,26,000 మంది ఉన్నారు. సగటున 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివా లయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో నలు గురైదుగురిని మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇరిగేషన్తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉంది. ఆయా మండలాల్లో ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని యోచిస్తోంది.

లోపాలపుట్ట..

గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలో లోపాలపై ఢిల్లీకి చెందిన 'సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్' సంస్థ జగన్ ప్రభుత్వ హయాంలోనే అధ్యయనం చేసింది. దీనిని సమూలంగా ప్రక్షా ళన చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. బలోపేతానికి తీసుకోవలసిన చర్యలనూ సూచించింది. అయితే దాని నివే దిక అప్పటి ప్రభుత్వ పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో అధికారులు దానికి బహిర్గతం చేయడానికి సాహసించలేదు. గ్రామ/వార్డు సచివాలయాల్లో చెప్పుకోదగిన రీతిలో సేవలు అందడం లేదు. పనిభారం పెద్దగా లేదని 'రీసెర్చ్' సంస్థ అధ్యయన నివేదిక పేర్కొంది. 2022 నవం బరు-2023 మే నెల నడుమ 37 శాతం గ్రామ సచివాల యాలు, 39.3% వార్డు సచివాలయాలు నెలకు కేవలం 5 శాతం లోపే సేవలు అందించాయి. గ్రామ సచివాలయాల్లో క్షేత్రస్థాయి పనులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ... పట్టణాల్లో చాలా తక్కువ. గ్రామ సచివాలయాలు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పనిచేయాలి. కొన్ని సెమీ అర్బన్ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా, ఇతర ప్రాంతాలను పట్టణ ప్రాంతా లుగా పంచుకోవాలి. సెమీ అర్బన్ ప్రాంతాలన్నీ గ్రామీణ,

! పట్టణ అవసరాలను కలిగి ఉంటాయి. వ్యవసాయం, ఉద్యాన వనం, పట్టణ స్థాయి మౌలిక వసతుల ప్రణాళికలు రూపొం దించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా జీవ నోపాధి అంశాలు, వ్యవసాయం, పశుసంవర్ధకం, తదితర మానవ వనరులున్నాయి. కానీ వార్డు సచివాలయాల్లో లేవు. ఎనర్జీ కార్యదర్శులు రెండు సచివాలయాల్లోనూ ఉన్నారు. భద్రత దృష్ట్యా విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి టీమ్ వర్క్ చేస్తున్నారు. ఇక గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీ లకు సమాంతర వ్యవస్థలుగా మారాయి. వీటి మధ్య సంబం థాల్లో స్పష్టత లేదు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులు పలు శాఖల ఆదేశాలతో పనిచేస్తున్నారు. ఇదే పరిస్థితి వార్డు సచివాలయాల్లోనూ నెలకొంది. వాటిలోని కార్యదర్శులు ఎక్కు వగా మున్సిపల్ శాఖతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. స్థాని కంగా ప్రజల అవసరాలను పరిష్కరించడం కన్నా ఆయా శాఖలు, మున్సిపల్ శాఖకు వారు జవాబుదారీగా ఉండాల్సి వస్తోంది. దీంతో గ్రామ/ వార్డు సచివాలయాలు సామాజిక లక్ష్యాలను సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలకు అవు టోపోస్టులుగా ఉన్నాయి. ఏఎన్ఎం, రెవెన్యూ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు గతంలోనూ ఉన్నారు. సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. వార్డు సచివాల యాల్లో రెవెన్యూ అధికారులకు పెద్దగా పనిలేదు. శానిటేషన్ కార్యదర్శులు పదే పదే పలు కార్యక్రమాలు తిరిగి చేపడుతు న్నారు. కొంత మంది టౌన్లోనింగ్- రెగ్యులేటరీ కార్యదర్శులకు పని పరిమితంగానే ఉంది. కొంత మంది కార్యదర్శులకు విస్తృ తమైన బాధ్యతలు పెట్టగా.. కొంత మందిని కొన్ని పథకాలకే పరిమితం చేశారు. శాఖాపరమైన నిబంధనల ప్రకారం ప్రాక్టి కల్ గా కొన్ని పరిమితమైన విధులు మాత్రమే వారు చేపడు తున్నారు. సచివాలయాల కార్యదర్శులు సామాజిక చైతన్యం కల్పించడంలో కీలక భూమిక పోషించడం లేదు. వారికి నిర్ద యాత్మక అధికారాలు లేకపోవడంతో పౌరుల అవసరాలకు సంబంధించి తక్షణమే స్పందించలేని పరిస్థితి నెలకొంది. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్- రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక అవసరాలకు అనుగుణంగా కార్యదర్శుల పాత్ర ఉండాలి' అని సూచనలు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న కొత్త ప్రభుత్వం

ప్రక్షాళనకు శ్రీకారం చుడుతోంది.
Tags:

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)